హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లకు రాజస్థాన్లోని బికనీర్కు చెందిన యువకుడు వినూత్న రీతిలో నివాళి అర్పించాడు. అతడి ఒంటి మీద వారి పేర్లను టాటూలుగా వేయించుకొని అమరులైన సైనికులకు అంజలి ఘటించాడు. భగత్ సింగ్ యూత్ బ్రిగేడ్ అనే సంస్థకు చెందిన గోపాల్ సహారన్ అనే యువకుడు ఈ టాటూలను వేయించుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పాటు గతంలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 71 మంది జవాన్ల పేర్లు అతడి ఒంటి మీద కనిపిస్తాయి.
Mon Jan 19, 2015 06:51 pm