హైదరాబాద్: సమానత్వం దిశగా దళిత మహిళలు అనే అంశంపై ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్టు దళిత స్త్రీ శక్తి సంస్థ జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. పద్మారావునగర్లోని ఎస్ఎస్ఎస్ కళ్యాణమండపంలో ఉదయం 11గంటలకు సదస్సును ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ కాకి మాధవరావు, ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకురాలు బి.విజయభారతి, పద్మశ్రీ పురస్కార గ్రహీత నర్రా రవి కుమార్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి బొడ్డుపల్లి గిరిజాదేవి తదితరులు పాల్గొంటారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm