హైదరాబాద్: తెలంగాణలో టీటీడీపీ లోక్ సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీటీడీపీ మద్దతు ఇవ్వనుంది. రాష్ట్రంలో క్యాడర్ ను కాపాడుకోవడానికి పోటీ చేయాలనుకున్న టీటీడీపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించినా చివరకు టీటీడీపీ మద్దతును కోరింది. టీటీడీపీ నాయకులతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఇప్పటికే ఫోన్లో మాట్లాడారు. నిన్న టీటీడీపీ నాయకులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm