రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ శివారులో చిరుత పులి సంచరిస్తోంది. నిన్న రాత్రి చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైంది. చిరుత సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గోవిందాయపల్లి, కడ్తాల్లో 5 బోన్లు ఏర్పాటు చేశారు. కడ్తాల్, యాచారం మండలాల్లో నెల రోజులుగా చిరుత సంచరిస్తోంది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm