అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఏపీలోఅందిన ఫామ్ 7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ప్రకటించింది. ఫామ్ 7 దరఖాస్తుల గుట్టు బయటపడింది. అందరూ అనుమానించేదే నిజమైంది. ఓట్లు తొలగించాలంటూ ఏపీలో లక్షలాదిగా దాఖలైన ఫామ్ 7 ధరఖాస్తుల్లో 85 శాతం బోగస్ అని తేల్చింది. కేవలం 15 శాతం మాత్రమే నిజమైన దరఖాస్తులు ఉన్నాయని తేల్చింది. ఏపీలో ప్రకంపనలు రేగిన దరఖాస్తుల వ్యవహారంలో ఏకంగా లక్షా 41వేల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm