హైదరాబాద్: మొబైల్స్ తయారీదారు హువావే ఇటీవలే మేట్ ఎక్స్ ఫోల్డబుల్ పేరిట ఓ నూతన మడతబెట్టే ఫోన్ను బార్సిలోనాలో విడుదల చేసిన విషయం విదితమే. ఇందులో 5జీకి సపోర్ట్ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీంతో భారత్లో విడుదల కానున్న తొలి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే కానుంది. హువావే మేట్ ఎక్స్ ఫోల్డబుల్ ఫోన్లో 6.6 ఇంచుల డిస్ప్లే, 6.38 ఇంచుల సెకండరీ డిస్ప్లే, కైరిన్ 980 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 40, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర రూ.1,85,220 గా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 24,2019 02:27PM