హైదరాబాద్: సెల్ఫీ సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనా తమిళనాడులోని నీలగిరి జిల్లా శ్రీదేవి ఆలయ సమీపంలో జరిగింది. ఓ వ్యక్తి ఏనుగుతో సెల్ఫీ తీసుకోబోయి.. అదే ఏనుగు కాళ్ల కింద నలిగిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు ఏనుగులు ఓ చోట ఉన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఏనుగుతో సెల్ఫీకి ప్రయత్నించాడు. అతడు కెమెరా వైపు చూస్తూ సెల్పీ తీసుకోబోయాడు. ఇంతలో ఆ వ్యక్తిని తొండంతో ఏనుగు తన వైపు లాక్కొని కాలుతో తొక్కింది. స్థానికులు ఏనుగును వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఏనుగు వెనక్కి తగ్గలేదు. ఎలాగోలా ఏనుగు బారి నుంచి యువకుడిని కాపాడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm