హైదరాబాద్: శోభ అనే మహిళ తన భర్త, ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి బిహార్లోని ఛాప్రాలో నివాసం ఉంటుంది. తన కొడుకు పదే పదే ఏడుస్తుండటంతో సముదాయించాల్సింది పోయి దారుణానికి ఒడిగట్టింది. భర్త ఇంట్లోలేని సమయంలో కుమారుడి పెదాలకు ఫెవిక్విక్ పూసింది. దీంతో చిన్నారి నోట్లో నుంచి నురగ వచ్చింది. ఈలోగా ఇంటికి వచ్చిన శోభ భర్త దీన్ని గమనించాడు. ఎందుకిలా నురగ వస్తోందని భార్యను ప్రశ్నించగా ఎంత సముదాయించిన ఏడుస్తూనే ఉన్నాడని అందుకే పెదాలకు గమ్ రాశానని చెప్పింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. శోభపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm