హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉన్న ఓ మసీదులో ఆదివారంనాడు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. చౌగామ్ విలేజ్లోని మసీదును శుభ్రం చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. మసీదులోని పైప్లైన్లు రాపిడికి గురైనందునే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని, క్షతగాత్రులను షోపియాన్కు చెందిన మహ్మద్ యూసుఫ్ డర్, మమ్మద్ యాసిన్ డర్గా గుర్తించామని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ఈ పేలుడు ఘటనను ఎస్పీ సందీప్ చౌదరి ధ్రువీకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm