నల్లగొండ : టీడీపీ మాదిరిగా కాంగ్రెస్ కూడా గాంధీ భవన్కి తాళం వేసుకునే పరిస్థితి వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేవరకొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని, ఉత్తమ్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు.
Mon Jan 19, 2015 06:51 pm