సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలం హుగెల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ప్రతీక్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తల్లితో కలిసి శుభలేఖలు పంచేందుకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ప్రతిక్ మృతి చెందాడు. బాధితులు హైదరాబాద్ కోంపల్లి వాసులుగా గుర్తించారు.
సూర్యపేట జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో రాగిరి జానకిరామ్(23) మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 24,2019 04:04PM