హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేతలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. చౌకీదార్లు (కాపలాదారులు) ధనవంతుల కోసమే పనిచేస్తున్నారని, పేదవారి గురించి పట్టించుకోవట్లేదని ఆమె విమర్శించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ప్రదేశ్ తూర్పు విభాగానికి బాధ్యురాలిగా నియమితమైన నేపథ్యంలో రాష్ట్రంలో తమ పార్టీని బలపర్చే పనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్న ఆమె.. వాటిని ప్రస్తావిస్తూ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేస్తూ, రైతుల సమస్యల పరిష్కారం కోసం భాజపా ప్రభుత్వం పనిచేయట్లేదని ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm