హైదరాబాద్: మహారాష్ట్ర రాష్ట్రంలోని పాల్గర్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm