హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ప్రసాద్కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. దీంతో ఆయన కారు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం సిరిపురం నుంచి ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వికారాబాద్ వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును పూలుమద్ది రోడ్డు మలుపు వద్ద ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్సనిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రసాద్కుమార్ వేరే కారులో హైదరాబాద్ వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm