హైదరాబాద్: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డికి ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది బాలాజీ వథేరా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని రాకేశ్ రెడ్డి నోటీసులు పంపింది. కాగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది.
Mon Jan 19, 2015 06:51 pm