హైదరాబాద్: 16 సీట్లు ఉండి.. ఐదేళ్లలో ఎలాంటి లబ్ధి చేకూర్చని కేసీఆర్.. పార్టీ లబ్ధి కోసమే 'పదహారు.. కారు.. సారు' ప్రచారం చేస్తున్నారని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉందన్నారు. తన గెలుపు కష్టమై ఉండొచ్చు కానీ.. అసాధ్యం కాదన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలు కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నారు. తనకు మద్దతుగా నిలిచే కాలనీ సంఘాలు, బస్తీ నాయకులు, డివిజన్ నేతలపై అధికారపార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అదిరింపులకు గురి చేసి.. గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుందన్నారు. ప్రశ్నించే గొంతుక కావాలని... ఏదైనా చేసి గెలుస్తామంటే అది కుదరదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm