ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. మిచెల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి పృథ్వీ షా(7) కీపర్ డీ కాక్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజ్లో ధవన్(2), అయ్యర్(1) ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm