హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని గంటస్తంభం వద్ద ఆదివారం సిసిఎస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అనుమానితుల నుంచి 2.317 కేజీల బంగారు ఆభరణాలు, 135 గ్రాముల బంగారు బిస్కెట్లుతో పాటు రూ.లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు ముక్కు పుటకలు తయారు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు భావిస్తున్నామని, మొత్తం బంగారం విలువ రూ. 70 లక్షలు ఉంటుందన్నారు. ఈ దిశగా మరింత లోతుగా విచారణ చేపట్టి, ఇందుకు బాధ్యులు ఎవరని తేలితే వారిపై కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తెలిపారు. ఎక్కడి నుండి బంగారాన్ని తెస్తున్నది, దానికి గల బిల్లులను జిఎస్టి డిప్యూటీ కమిషనర్ చంద్రలేఖ పరిశీలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm