హైదరాబా: కర్ణాటకలో ఓలా సర్వీసులపై వేసిన నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఓలాపై పడిన నిషేధం వల్ల ఎంతో మంది నిరుద్యోగులవుతారని, ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఫిర్యాదులు రావడంతో ఈ సేవలను తిరిగి ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఓలా క్యాబులు ఈ రోజు నుంచి యథావిధిగా నడుస్తాయి. ప్రభుత్వ నియమాలకు లోబడి పరిశ్రమలు గానీ కంపెనీలు గానీ నడుచుకోవాలి. ప్రభుత్వ విధానాలకు దగ్గరగా ప్రైవేటు సంస్థల పాలసీలు ఉండాలి. ఓలా అంశంపై ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ పీఎం పరమేశ్వరతో మాట్లాడాం. పెట్టుబడి దారులు, పరిశ్రమలు, వినియోగదారులకు మధ్య సత్సంబంధాలు ఉండాలి. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఎవరి విధానాలు ఉండకూడదు అని మంత్రి ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm