హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ మండ్య నుండి ఎంపీగా పోటీచేస్తుండగా దేవెగౌడ పిలుపు మేరకు బాబు ప్రచారానికి వెళ్లారు. ఈ ప్రచార సభలో మాట్లాడిన బాబు కాంగ్రెస్, బీజేపీయేతర ప్రధానిగా గౌడ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అయన కుమారుడు కుమారస్వామి కూడా దేవెగౌడ బాటలోనే సుపరిపాలన అందిస్తున్నారని.. కేంద్రం నుండి దక్షణాది రాష్ట్రాలకు చేయూత లేకపోగా కక్షసాధింపు ఉంటుందన్నారు. మోడీపాలనలో వ్యవసాయం దెబ్బతిన్నదని..నిరుద్యోగం పెరిగిపోయిందని.. పెద్దనోట్ల వలన ఎవరికైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. మోడీ మాటలకు.. పనులకు పొంతన ఉండదని.. ఆర్ధిక వ్యవస్థను సైతం చిన్నాభిన్నం చేశారన్నారు. రెండువేల నోట్లు వలన రాజకీయాలలో అవినీతి పెరిగిపోయిందని.. రెండువేల నోట్లు ఎందుకు తెచ్చారో మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ ఆజ్ఞల మేరకే ఈసీ కూడా పనిచేస్తుందని.. వీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని మరోసారి సుప్రీంకోర్టు వెళ్తామన్నారు. ఐటీలో కర్ణాటక దూసుకుపోతోందని.. ఐటీ కేంద్రంగా కర్ణాటక అభివృద్ధి చెందుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm