హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదివారం సెలవు రోజు అయినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో బోర్డు కార్యాలయానికి తరలివచ్చారు. ఆదివారం సెలవు ఉందని, ఏదైనా సమస్య ఉంటే ఇంటర్నెట్లో ఫిర్యాదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కార్యాలయ సిబ్బంది సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm