హైదరాబాద్ : ఈస్టర్ పండుగనాడు తీవ్ర విషాదాన్ని నింపుతూ మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు లక్ష్యంగా కొలంబాలో ఆదివారం ఉదయం జరిగిన గొలుసుకట్టు పేలుళ్లలో 130 మృతి చెందగా, 300 మంది వరకూ గాయపడటంతో శ్రీలంక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడులను ఆత్మాహుతి దాడులుగా అనుమానిస్తున్న ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. మొబైల్ సేవలను నిలిచివేసింది. ఆర్మీకి చెందిన 200 ట్రూప్లను దేశవ్యాప్తంగా మోహరించడంతో పాటు అత్యవసర సేవలను రంగంలోకి దింపింది. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు స్థానిక భద్రతా సిబ్బంది తలమునకలవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm