హైదరాబాద్ : త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలా మంది రైతులకు పాస్బుక్లు, రైతుబంధు చెక్కులు అందలేదన్నారు. ఇంటర్బోర్డులో జరిగిన సంక్షోభంపై ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm