హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామంలో జరిగింది. ఘటన వివరాల్లోకి వెళితే.. రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు ఈడిగ రామాంజి, ఈడిగ ప్రతాప్ లు పావగడలో జరిగే ఓ వివాహా కార్యక్రమంలో పాల్గొనడానికి బైక్ పై వెళ్తుండగా ఈచర్ వాహానం వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm