హైదరాబాద్ : శ్రీలంక రాజధాని కొలంబోలో తాజాగా మరో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఏడో పేలుడు ఇది. కొలంబో సమీపంలోని దెహివెలాలో మధ్యాహ్నం చోటుచేసుకున్న పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా, ఇవాళ ఉదయం కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 160కి చేరింది. క్షతగ్రాతులు 300 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. పేలుళ్ల వెనుక ఆత్మాహుతి దళాల పాత్ర ఉన్నట్టు శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ముందుజాగ్రత్తగా సైన్యాన్ని రంగంలోకి దింపుతూ దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm