హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ ప్రాంతంలో భద్రతా దళాలు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ప్రత్యేక యాంటీ నక్సల్స్ గ్రేహౌండ్స్ యూనిట్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులపై నక్సల్స్ కాల్పులకు పాల్పడగా.. పోలీసులు వీటిని తిప్పికొట్టారు. కాల్పులు ముగిసిన తర్వాత పోలీసులు ఘటనాస్థలి నుంచి ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm