హైదరాబాద్ : వాస్తవాలు చెప్పడానికి కర్ణాటక రాష్ట్రానికి వచ్చానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి తరపున ఆదివారం ఆయన శ్రీరామ్నగర్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వల్ల ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈసారి మోడీ గెలిస్తే... మనం శ్రీరాం నగర్లో కూడా మీటింగ్లు పెట్టుకోలేమని అన్నారు. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను కర్ణాటకకు రానీయకుండా కేసుపెట్టి జైల్లోపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అలాంటి దుర్మార్గుడు నరేంద్రమోడీ అని అన్నారు. అలాంటి వ్యక్తిని అధికారంలోకి రానిస్తామా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm