హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్షం అన్నది లేకుండా పోయేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే పదిమంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా ఇప్పుడు మరి ఐదుగురు ఎమ్మెల్యేలు కారెక్కనున్నారు. ఏకంగా సీఎల్పీని టీఆర్ఎస్లోకి విలీనం చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ ఆదివారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో మూడు లేదా నాలుగు రోజులలో సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బీ ఫార్మ్స్ కోసమే తాము ఇక్కడికి వచ్చామని.. కాంగ్రెస్ పార్టీలో చివరికి ముగ్గురు మాత్రమే మిగులుతారని.. మిగిలిన వారంతా టీఆర్ఎస్ పార్టీలోకే చేరిపోతారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm