హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్లో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా కష్టాల్లో కూరుకుపోతోంది. 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టు తొలి మూడు ఓవర్లలో ఇరగదీసింది. అయితే, నరైన్ (25) అవుటయ్యాక స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. 42 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్కతా ఆ తర్వాత కాసేపటికే శుభ్మన్ గిల్ (3) వికెట్ను చేజార్జుకుంది. నితీశ్ రాణా (11), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6)లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో కోల్కతా స్కోరుబోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి కోల్కతా నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రిస్ లిన్ 40, రింకు సింగ్ 4 క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm