హైదరాబాద్ : శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అయితే ఆయన మరణించిన వారి సంఖ్యలను తప్పుడుగా రాశారు. ఏకంగా 138 మిలియన్లు చనిపోయినట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు ట్రంప్. అయితే పొరపాటును గుర్తించిన ఆయన, వెంటనే దాన్ని సరి చేశారు. తప్పుడుగా ఉన్న ట్వీట్ను డిలీట్ చేసి, అసలు సంఖ్యతో మరో ట్వీట్ చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రమూకల పైశాచికానికి ఇప్పటి వరకు 207 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ ఉందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm