హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని ఉల్లంఘిస్తున్నారంటూ లేఖ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలతో ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm