హైదరాబాద్ : ఇంటర్మీడియేట్ ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలను తొలగించడానికి గాను కమిటీ వేయడం జరిగిందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. టియస్ టియస్ యండి వెంకటేశ్వర రావుతో పాటు మరో ఇద్దరు నిపుణులతో ఈ కమిటీ నియామకం జరిగిందన్నారు. హైదరాబాద్ బిట్స్ కు చెందిన నిపుణుడు ప్రొఫెసర్ వాసన్ తో పాటు ఐఐటి హైదరాబాద్ కు ప్రొఫెసర్ నిశాంత్ లను నియమించామన్నారు. ప్రొఫెసర్ వాసన్ ఐటి మీద స్పష్టమైన అవగాహన ఉందని, ప్రొఫెసర్ నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణుడని ఫలితాల గందరగోళానికి పరిష్కారం దొరుకుతుందన్నారు. ఫలితాల విషయంలో విద్యార్థులు తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని, ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీ-వేరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని, కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలవల్లే ఈ అపోహలు సృష్టించబడ్డాయని, ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm