హైదరాబాద్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్స్టో సరికొత్త రికార్డు సృష్టించాడు. కోల్కతా నైట్రైడర్స్తో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో బెయిర్స్టో చెలరేగిపోయాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో బెయిర్స్టో 445 పరుగులు చేశాడు. ఫలితంగా ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బెయిర్స్టో సరికొత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 439 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును బెయిర్స్టో బద్దలు గొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఫా డుప్లెసిస్(398-సీఎస్కే, 2012), ఎల్. సిమ్మన్స్(394-ఎంఐ, 2014), ఆర్.త్రిపాఠీ (391, ఆర్పీఎస్-2017), లూయిస్ (382, ఎంఐ-2018) ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm