పాట్నా: లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భద్రతా సిబ్బంది ఓ కెమెరామెన్పై దాడి చేశారు. యాదవ్ కారు విండ్స్క్రీన్ పగులగొట్టాడన్న కారణంగా కెమెరామెన్పై భద్రతా సిబ్బంది దాడి చేశారు. పాట్నాలో తేజ్ ప్రతాప్ ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి తన కారు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ ఒకింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తాను ఓటు వేసి తిరిగి వస్తుండగా ఓ ఫోటోగ్రాఫర్ తన కారుపై దాడి చేసినట్టు చెప్పారు. ఇందులో తన బౌన్సర్లు చేసిందేమీ లేదని, ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm