హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల విధుల్లో ఉన్న ముగ్గురు ప్రభుత్వోద్యోగులు మృతి చెందారని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పారు. ప్రిసైడింగ్ అధికారి, కిన్నౌర్ జిల్లా సప్రిలోని ప్రభుత్వ పాఠశాలలో పిజిటిగా పని చేస్తున్న వినీత్ కుమార్, సోలన్ జిల్లాలోని చందేరా గ్రామానికి చెందిన హోమ్గార్డు దేవీ సింగ్, పోలింగ్ అధికారి, కుల్లు జిల్లాలోని సజ్లా గ్రామానికి చెందిన జూనియర్ టెక్నిషియన్ లాల్ రామ్ వివిధ అనారోగ్య సమస్యలతో మృతి చెందారని ఎన్నికల అధికారులు చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న ముగ్గురు మృతి చెందడం పట్ల రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి దలీప్ నేగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయిల
Mon Jan 19, 2015 06:51 pm