హైదరాబాద్ : ఈ లోక్సభలో ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చివరి విడత పోలింగ్. దేశంలోని తల్లులు, సోదరీమణులంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కేవలం అభ్యర్థులుగా మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. వారందిరికీ నా సెల్యూట్ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో పాటు మాకు సమాన అవకాశాలు, గౌరవం కావాలంటూ మహిళలు కోరుతున్న ఓ వీడియోని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. తుది విడతలో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm