హైదరాబాద్ : రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని టేక్ మాల్ మండలం బొడుమట్ పల్లి శివారులో ఆటో చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జహీరాబాద్ నుంచి మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm