హైదరాబాద్ : ప్రాథమికంగా ఫలితాల గురించి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. మోడీకి వ్యతిరేకంగా తామంతా కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ నెల 23న ఫలితాలు వచ్చాక తదుపరి నిర్ణయాలు ఉంటాయని అన్నారు. కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రస్తుతానికి అసందర్భమని వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చాకే రాష్ట్రపతిని కలిసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm