హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసం వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఈ ఉదయం 9:15నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో.. అదే ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న వెంకటేశ్(45) అనే వ్యక్తి మృతిచెందినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ టి. సునీల్కుమార్ తెలిపారు. మృతుడు అదే ప్రాంతంలో దోబిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. భూమిలో అమర్చిన మందుగుండును పేల్చడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు. పేలుడు కారణంగా భూమిపై చిన్నగొయ్యి ఏర్పడిందని చెప్పారు. బాంబ్స్వాడ్ రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపడుతోందన్నారు. ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఈ డాడికి పాల్పడ్డారో, దీని వెనుక ప్రధాన సూత్రధారులెవరో దర్యాప్తులో మరిన్ని విషయాలు తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm