హైదరాబాద్ : కేంద్రమంత్రులు కొందరు తాము నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాల బకాయిలను చెల్లించలేదు. గత ఫిబ్రవరి వరకూ బకాయిలను చెల్లించలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బదులిచ్చింది. బకాయిలు చెల్లించని మంత్రుల్లో విజయ్ గోయెల్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్ తదితరులున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ కూడా తమ నివాస భవనాల బకాయిలను చెల్లించలేదు. ఇవి ఆయా భవనాలలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్, తదితర పలు సామగ్రికి చెల్లించాల్సిన బకాయిలని ఒక అధికారి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm