హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 17వ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. పలు రాష్ర్టాల్లో చిన్న చిన్న ఘర్షణలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం ఏడు విడుతల్లో 542 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 545 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఇందులో రెండు స్థానాల్లో ఆంగ్లో ఇండియన్స్ ను నామినేట్ చేస్తారు. ఈ క్రమంలో 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగని ఆ ఒక్క లోక్ సభ స్థానం తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో ఎన్నికను రద్దు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm