హైదరాబాద్ : విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బృందం ప్రెస్మీట్కు అనుమతి నిరాకరించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదుచేసింది. నోవాటెల్, ఐలాపురం హోటల్ యాజమాన్యాలతో పాటు, ఏపీ డీజీపీ, విజయవాడ సీపీ లకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm