హైదరాబాద్ : సుందరయ్య పార్క్ లో గల సుందరయ్యకు ప్రజానాట్యమండలి హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఘన నివాళి అర్పించారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత కామ్రేడ్ సుందరయ్య 34వ వర్ధంతి సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు తన ఆటపాటలతో ఆదర్శం నేత సుందరయ్యకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి హైదరాబాద్ నగర కార్యదర్శి సైదులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm