చండీగర్: శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) అధినేత సుఖబీర్ సింగ్ బాదల్ చిన్న కుమార్తె గుర్లీన్ కౌర్ కోడ్ ఉల్లంఘించారంటూ ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటీసు జారీ చేసింది. తొలిసారి ఓటు వేయడానికి వచ్చిన గుర్లీన్ కౌర్ ఎస్ఎడి బాడ్జి ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చారని ఒక అధికారి చెప్పారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు పార్టీ బ్యాడ్జి ధరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ నోటీసు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm