హైదరాబాద్: తమిళంలో వరుస అవకాశాలతో ఐశ్వర్య రాజేశ్ దూసుకుపోతోంది. ఈ ఐశ్వర్య రాజేశ్ ఎవరో కాదు .. ఒకప్పుడు తెలుగులో 'మల్లెమొగ్గలు'తో హీరోగా పరిచయమైన రాజేశ్ కూతురు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ, ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను కొన్ని మొహమాటాల కారణంగా చేయవలసి వచ్చింది. అలాంటి పాత్రల వలన నాకు ఎంతమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరహా పాత్రల్లో ఒకటి ''సామీ స్క్వేర్'' లో చేశాను. ఆ సినిమాలో రెండో కథానాయికగా ఎంత మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇకపై ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోలేదు .. అలాంటి పాత్రలను చేయదలచుకోలేదుఁ అని చెప్పుకొచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 20,2019 11:19AM