హైదరాబాద్: ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ను అన్ని కేంద్రాల నుండి వెబ్ కాస్టింగ్ చేయాలని అధికారులను ఇసి ఆదేశించింది. ఈ నెల 27 న నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియను తప్పనిసరిగా ఆయా కేంద్రాల నుండి వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఫలితాలను ప్రజలకు ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలపాలని ఇసి సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm