న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియగానే జాతీయ స్థాయిలో వెలువడిన సర్వే ఫలితాలను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ మాట్లాడుతూ... ఈ సర్వే ఫలితాలు తప్పని చెప్పారు. ఆస్ట్రేలియా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను ఆయన ఉదహరించారు. గతవారం ఆస్ట్రేలియాలో సుమారు 56 సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ తప్పని అక్కడ తుది పలితాలు నిరూపించాయని ఆయన చెప్పారు. 23వ తేదీ పూర్తి ఫలితాలు వచ్చే వరకూ వేచి చూద్దామని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm