లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఓపీ రాజ్భర్ను మంత్రివర్గం నుంచి వెంటనే డిస్మిస్ చేయాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ రాంనాయక్ కు సోమవారం లేఖ రాశారు. యూపీలో వెనుకబడిన తరగతులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి రాజ్ భర్ గతంలోనే రాజీనామా చేసినా, దాన్ని ఆమోదించలేదు. ఎన్నికల పోలింగ్ పర్వం ముగిశాక మంత్రి రాజ్ భర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం యోగి సోమవారం లేఖ రాశారు. సుహేల్ దేవ్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు అయిన రాజ్ భర్ సీట్ల సర్దుబాటులో విబేధాలతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా సుహేల్ దేవ్ సమాజ్ పార్టీని తుడిచిపెట్టాలని చూస్తుందని రాజ్ భర్ ఆరోపించారు. 2017 నుంచి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న రాజ్ భర్ దీంతో ఆ పార్టీకి దూరం కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm