కర్నూలు: నంద్యాల విషాదం నెలకొంది. మనస్థాపం చెందిన ఓ ప్రేమికుడు ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణంలోని సలీంనగర్లో చోటుచేసుకుంది. ప్రియురాలి ఇంటిపై నుంచి దూకి ప్రియుడు సన్నీ మోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలి తండ్రి తనపై కిడ్నాప్ కేసు పెట్టడంతో మోహిత్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మోహిత్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm