అమరావతి: మోడీకి వత్తాసు పలికే చానళ్లే.. జగన్కూ వత్తాసు పలుకుతున్నాయని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటి రాజగోపాల్ సర్వే కరెక్ట్ కాదని.. తమకు 130 సీట్లు వస్తున్నాయని అందులో ఎలాంటి అనుమానమూ లేదన్నారు. వైసీపీ ఓడిపోతుందని జగన్కు కూడా తెలుసని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
లగడపాటి అంచనాలను మించి తమకు సీట్లు వస్తాయన్నారు. సర్వేలు చాలా చోట్ల అంచనాలు తప్పుతున్నాయని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఎన్డీఏకి బాగా తక్కువ సీట్లు వస్తున్నాయన్నారు. అయితే ఎక్సిట్ పోల్స్లో కావాలని మోడీ హైప్ చేయించారని ఆరోపించారు. ఇటు రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే లు మోదీ ఆదేశాల మేరకే అలా చెప్పాయన్నారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. మహిళలంతా టీడీపీకే ఓట్లు వేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 20,2019 12:00PM